devisri prasad: మహేశ్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా పాటలుంటాయని ప్రామిస్ చేస్తున్నాను: దేవిశ్రీ ప్రసాద్

  • లాంఛనంగా మొదలైన మహేశ్ మూవీ
  • కామెడీతో పాటు యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యత
  •  మాస్ సాంగ్ ఉంటుందన్న దేవిశ్రీ  

మహేశ్ బాబు .. అనిల్ రావిపూడి కాంబినేషన్లోని 'సరిలేరు నీకెవ్వరు' సినిమా, ఈ రోజు ఉదయమే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమా సంగీత దర్శకుడైన దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ వేడుకకి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. 'మహర్షి' విజయోత్సవ వేడుక జరుపుకుంటూ కొత్త ప్రాజెక్టులోకి ఎంటరవుతున్నందుకు సంతోషంగా వుంది. 'మహర్షి' తరువాత మహేశ్ సినిమా ఆయిన 'సరిలేరు నీకెవ్వరు'లోను నాకు ఛాన్స్ లభించడం ఆనందంగా వుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కామెడీతో పాటు యాక్షన్ .. ఎమోషన్ కూడా ఉంటాయి. మహేశ్ అభిమానులు తమ హీరోకి ఒక మాస్ మసాలా సాంగ్ ఇవ్వమని అడుగుతున్నారు. ఈ సినిమాతో ఆ ముచ్చట తీరుస్తాను. ఇక రొమాంటిక్ సాంగ్స్ కూడా ఒక రేంజ్ లో వుంటాయని ప్రామిస్ చేస్తున్నాను" అని అన్నారు. 

More Telugu News