Cricket: పాకిస్థాన్ పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

  • నాటింగ్ హామ్ లో మ్యాచ్
  • విండీస్ జట్టులో భారీ హిట్టర్లు
  • పేలవంగా కనిపిస్తున్న పాక్ బౌలింగ్ దళం

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. నాటింగ్ హామ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇటీవల కాలంలో పాక్ బౌలింగ్ పేలవంగా మారిన నేపథ్యంలో విండీస్ కెప్టెన్ నిర్ణయం ఎవరినీ ఆశ్చర్యానికి గురిచేయలేదు. దానికితోడు కరీబియన్ టీమ్ లో గేల్, హోప్, రస్సెల్ వంటి భారీ హిట్టర్లు ఉండడం కూడా కెప్టెన్ జాసన్ హోల్డర్ నిర్ణయం సబబే అనిపిస్తోంది. ఇక పాకిస్థాన్ టీమ్ విషయానికొస్తే ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పలేని పరిస్థితి. జట్టు కూర్పు పరంగా చూస్తే బాబర్ అజామ్, ఫఖర్ జమాన్, ఇమాముల్ హక్ వంటి బ్యాట్స్ మన్లు, మహ్మద్ అమీర్, వాహబ్ రియాజ్ వంటి బౌలర్లతో ఫర్వాలేదనిపిస్తోంది. 

More Telugu News