saipallavi: నెటిజన్లకు సారీ చెప్పిన సాయిపల్లవి

  • సూర్య జోడీగా సాయిపల్లవి 
  • ఈ రోజునే వచ్చిన 'ఎన్జీకే'
  • అసహనానికి లోనైన అభిమానులు

సాయిపల్లవి తాజా చిత్రంగా రూపొందిన 'ఎన్జీకే' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూర్య జోడీగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది. ఈ సినిమా విడుదలకి ముందు నెటిజన్లతో చిట్ చాట్ చేయాలనీ, సినిమా విశేషాలను అభిమానులతో పంచుకోవాలని సాయిపల్లవి భావించింది. అందుకు టైమ్ ను కూడా ఫిక్స్ చేసి అభిమానులకు తెలియపరిచింది.

అయితే కొన్ని కారణాల వలన ఆమె అభిమానులతో చాట్ చేయలేకపోయింది. దాంతో నిరాశకి లోనైన నెటిజన్లు సాయిపల్లవి ధోరణి పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. 'మా సమయం వృథా చేసుకుని నీతో చాటింగుకి వెయిట్ చేస్తుంటే నువ్వు చీటింగ్ చేస్తావా?' అంటూ విరుచుకుపడ్డారు. దాంతో సాయిపల్లవి నెటిజన్లకు 'సారీ' చెప్పేసింది. 'మరోసారి ఎప్పుడైనా సోషల్ మీడియాలో కలుద్దాం' అంటూ కూల్ చేసింది.

More Telugu News