Mahesh Babu: 'సరిలేరు నీకెవ్వరు' ఓపెనింగుకి మహేశ్ బాబు అందుకే రాలేదట!

  • మహేశ్ హీరోగా 'సరిలేరు నీకెవ్వరు'
  • ఈ రోజునే జరిగిన పూజా కార్యక్రమాలు
  •  ఎప్పటిలానే హాజరుకాని మహేశ్ బాబు

మహేశ్ బాబు 26వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనుంది. ఈ రోజునే హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమా దర్శక నిర్మాతలతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకి మహేశ్ బాబు రాకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

మహేశ్ బాబు ఈ ప్రారంభోత్సవ వేడుకకి రాకపోవడానికి కారణం సెంటిమెంట్ అని తెలుస్తోంది. సినిమా ఓపెనింగ్ రోజున తాను వస్తే ఆ సినిమా సరిగ్గా ఆడదనే సెంటిమెంట్ మహేశ్ బాబుకు ఉందట. అందువల్లనే ఆయన ఈ సినిమా పూజా కార్యక్రమాలకి హాజరుకాలేదని అంటున్నారు. ఇంతకుముందు చేసిన అరడజను సినిమాలకి కూడా ఆయన ఓపెనింగ్ రోజున రాలేదు. అదే సెంటిమెంట్ ను ఈ సినిమా విషంయలోను ఫాలో అయ్యాడన్న మాట. 

More Telugu News