BJP president: మంత్రి వర్గంలో చేరినా అధ్యక్ష పదవి మాత్రం అమిత్‌షాదే

  • బీజేపీ చీఫ్‌గా కొనసాగించే అవకాశం
  • త్వరలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఉండడం వల్లే
  • తాజా నిర్ణయమని పార్టీ వర్గాల్లో చర్చ

కేంద్రంలో మంత్రిగా అమిత్‌షా చేరినప్పటికీ బీజేపీ చీఫ్‌గా ఆయననే కొనసాగించాలని ప్రధాని భావిస్తున్నట్లు సమాచారం. అమిత్‌ షాను మంత్రి వర్గంలోకి తీసుకుంటే అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారన్న చర్చ సాగుతున్న నేపధ్యంలో తాజాగా ఈ అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రానున్న రోజుల్లో మహారాష్ట్ర, జార్ఖండ్‌, హర్యానా, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అవి పూర్తయ్యే వరకు అమిత్‌ షా చేతుల్లోనే పగ్గాలు ఉండడం మంచిదన్న అభిప్రాయం పార్టీలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ అంశంపై తర్జన భర్జన జరుగుతున్నప్పటికీ ఒకటి రెండురోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More Telugu News