prabhas: 'సాహో' రిలీజ్ డేట్ గురించి స్పందించిన దర్శకుడు సుజిత్

  • 'సాహో' నుంచి తప్పుకున్న సంగీత దర్శకులు
  • విడుదల ఆలస్యం అంటూ ప్రచారం 
  • క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకులుగా పనిచేస్తోన్న శంకర్ ఎహసాన్ లాయ్, రీసెంట్ గా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. అందుకు పలు కారణాలు ఫిల్మ్ నగర్లో షికారు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై తాజాగా సుజిత్ స్పందిస్తూ, "ముందుగా చెప్పినట్టుగానే ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తాము .. ఇందులో ఎలాంటి సందేహం లేదు. విడుదల విషయంలో వస్తోన్న ఎలాంటి పుకార్లను నమ్మవద్దు" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News