kumaraswamy: రాజీనామా చేయవద్దని రాహుల్ కి చెప్పేందుకు వెళ్తున్నా: కుమారస్వామి

  • రేపు రాహుల్ ను కలవనున్న కుమారస్వామి
  • బెంగళూరులో సీఎల్పీ సమావేశం
  • అసంతృప్తులను బుజ్జగించినట్టు సమాచారం

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలిసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఢిల్లీ బయల్దేరి వెళ్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, రేపు రాహుల్ ను కలుస్తానని చెప్పారు. నిరాశాజనక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాహుల్ గాంధీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని... ఈ విషయంలో ఆయనకు నచ్చజెప్పేందుకు యత్నిస్తానని తెలిపారు. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని బీజేపీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బెంగళూరులో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసంతృప్తులను బుజ్జగించినట్టు సమాచారం.

More Telugu News