ambika krishna: ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తుండటం బాధాకరం: అంబికా కృష్ణ

  • ఎన్టీఆర్ విగ్రహాన్ని చూడగానే ఒక స్ఫూర్తిని పొందుతాము
  • తెలుగుదేశం వాళ్లెవరూ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల జోలికి వెళ్లలేదు
  • వైసీపీ నాయకులు కూడా ఇలాంటివి ఖండించాలి

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో విజయాన్ని సాధించింది. దాంతో ఈ పార్టీకి చెందిన కొంతమంది ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారనే వార్తలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ నాయకుడు అంబికా కృష్ణ ఈ విషయంపై స్పందిస్తూ ఈ వైఖరిని ఖండించారు.

"గొప్పవారి విగ్రహాలను చూడగానే ఒక స్ఫూర్తిని పొందుతాము. వాళ్ల జీవితాలను ఆదర్శంగా తీసుకుంటాము. తెలుగు దేశం పార్టీ గెలిచినప్పుడు రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను పడగొట్టేయడం ఎక్కడా జరగలేదు. ఇలాంటివి విన్నప్పుడు నిజంగా నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఇలాంటి పనులను వైసీపీ నాయకులు కూడా ఖండించవలసిన అవసరం వుంది. ఒక చోట 'తెలుగు దేశం' అని రాసి వున్న బల్లను పగులగొట్టారు .. మరో చోట సైకిల్ ను బైక్ కి కట్టేసి లాక్కెళుతున్నారు .. ఇది ఎంతటి మూర్ఖత్వం? ఇలా చేయకూడదని లోకల్ గా వున్న నాయకులు చెప్పాలి. లేదంటే ఆ తప్పు వాళ్లది అవుతుంది" అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు.

More Telugu News