Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సరికొత్త రికార్డు!

  • తొలుత కిరణ్ కుమార్ రెడ్డిచేత ప్రమాణస్వీకారం
  • అనంతరం బాబు, కేసీఆర్ తో ప్రమాణం
  • రేపు జగన్ చేత ప్రమాణం చేయించనున్న నరసింహన్

తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ మరో అరుదైన ఘనత సాధించనున్నారు. ఐదుగురు ముఖ్యమంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ గా ఆయన రికార్డు సృష్టించనున్నారు.  2010, నవంబర్ 25న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేత సీఎంగా నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుల చేత 2014లో ప్రమాణస్వీకారం చేయించారు.

ఆ తర్వాత తెలంగాణ సీఎంగా కేసీఆర్ చేత రెండోసారి నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. తాజాగా రేపు మధ్యాహ్నం 12.23 గంటలకు వైసీపీ అధినేత జగన్ చేత నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. తద్వారా ఐదుగురు ముఖ్యమంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించిన అరుదైన ఘనతను ఈఎస్ఎల్ఎన్ నరసింహన్ సొంతం చేసుకోనున్నారు.

More Telugu News