surya: రకుల్ తీరుతో ముభావంగా మారిపోయిన సాయిపల్లవి

  • సూర్య హీరోగా రూపొందిన 'ఎన్జీకే'
  • ప్రమోషన్స్ లో బిజీగా హీరోయిన్లు
  •  ఈ నెల 31న రెండు భాషల్లో విడుదల

సూర్య కథానాయకుడిగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన 'ఎన్జీకే' సినిమా, ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఇదే రోజున ఈ సినిమా విడుదలవుతోంది. దాంతో సూర్య .. రకుల్ .. సాయిపల్లవి ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వున్నారు.

ప్రమోషన్స్ లోను రకుల్ .. సాయిపల్లవి ఎడముఖం పెడముఖంగా వుంటున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో తన పాత్రకంటే సాయిపల్లవి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉందనీ, సెట్లో తనకంటే ఆమెనే ఎక్కువగా గౌరవిస్తున్నారంటూ షూటింగు సమయంలో రకుల్ అసహనాన్ని ప్రదర్శించిందట. అందువల్లనే ఆమెతో సాయిపల్లవి ముభావంగా ఉంటోందని చెప్పుకుంటున్నారు. మరోపక్క, ఈ సినిమాలో ఇద్దరి పాత్రలకి సమానమైన ప్రాధాన్యత ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. 

More Telugu News