Paruchuri Gopalakrishna: విజయలక్ష్మి నన్ను నమ్మి నేటికి నలభై తొమ్మిదేళ్లు: పరుచూరి గోపాలకృష్ణ!

  • గోపాలకృష్ణ వివాహమై 49 సంవత్సరాలు
  • తన జీవితంలోని ప్రతి మార్పుకూ భార్యే కారణం
  • ఆమె అంగీకరిస్తేనే అన్నీ జరిగాయన్న పరుచూరి

టాలీవుడ్ రచయిత, ప్రముఖ నటుడు పరుచూరి గోపాలకృష్ణకు వివాహమై నేటికి 49 సంవత్సరాలు కాగా, తన భార్యను అభినందిస్తూ, ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పంచుకున్నారు. "విజయలక్ష్మి నన్ను నమ్మి నాతో కలసి ఏడడుగులు నడిచి నేటికి నలభై తొమ్మిదేళ్లు నిండి, యాభయ్యవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. నా జీవితంలో సంభవించిన ప్రతి మార్పు తనతో చర్చించి , తాను అంగీకరించాకే జరిగింది. కుటుంబ సభ్యులు, మీ అందరి ఆశీర్వాద బలంతో ముందడుగు వెయ్యాలని కోరుకుంటున్నాం" అని ఆయన ట్వీట్ పెట్టారు. ఇప్పుడా ట్వీట్ వైరల్ అవుతోంది.




More Telugu News