Jagan: పదేళ్లపాటు పోరాటం చేసి జగన్ అధికారంలోకి వచ్చారు: దుర్గగుడి ఈవో

  • జగన్ అడుగు జాడల్లో అంతా నడవాలి
  • జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు
  • అమ్మవారి దర్శనానికి కేసీఆర్, స్టాలిన్

వైసీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి జగన్‌ అడుగు జాడల్లో అంతా నడవాలని దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ పేర్కొన్నారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టి 151 సీట్లలో గెలిపించారని ఆమె పేర్కొన్నారు. పదేళ్లపాటు జగన్ ప్రజల కోసం పోరాటం చేసి అధికారంలోకి వచ్చారని ఆమె తెలిపారు. రేపు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు డీఎంకే అధినేత స్టాలిన్, ముగ్గురు గవర్నర్లు కూడా అమ్మవారి దర్శనానికి వస్తున్నట్టు కోటేశ్వరమ్మ తెలిపారు.

More Telugu News