KCR: కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారు: రేవంత్ రెడ్డి

  • పార్టీ మారుతున్న ప్రచారంలో నిజం లేదు
  • రాహుల్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
  • రాహుల్ నాయకత్వాన్ని బలపరుస్తా

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించిన కేసీఆర్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పారని కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన రేవంత్‌ను నేడు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. రాహుల్ గాంధీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. రాహుల్ నాయకత్వాన్ని బలపరుస్తానని రేవంత్ పేర్కొన్నారు.

More Telugu News