Renigunta: రేణిగుంటలో జగన్ కు ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు

  • గన్నవరం నుంచి రేణిగుంట చేరుకున్న జగన్
  • ఎయిర్ పోర్టు వద్ద అభిమానుల సందడి
  • రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరిన జగన్

వైసీపీ అధినేత జగన్ ఈరోజు సాయంత్రం తిరుమలకు బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన జగన్ కొద్ది సేపటి క్రితం రేణిగుంట చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఎయిర్ పోర్టు వద్ద జగన్ కు కలెక్టర్ ప్రద్యుమ్న, 17 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు స్వాగతం పలికారు.

ఎన్నికల తర్వాత తొలిసారి జగన్ అక్కడికి వెళ్లడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. రేణిగుంట నుంచి తిరుమలకు రోడ్డు మార్గంలో జగన్ బయలుదేరారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి అలిపిరి వరకూ జగన్ ర్యాలీగా వెళ్లారు. ప్రజలు, అభిమానులకు జగన్ అభివాదం చేశారు. ఈరోజు రాత్రికి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో జగన్ బస చేయనున్నారు. రేపు ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం, తిరుమల నుంచి కడపకు జగన్ వెళ్లనున్నారు.

More Telugu News