Raghavendrarao: ముగ్గురు హీరోయిన్స్ ... తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు!

  • నిన్న ఎస్వీబీసీకి రాజీనామా చేసిన రాఘవేంద్రరావు
  • వెంటనే కొత్త సినిమా ప్రకటన
  • ఫేస్ బుక్ లో స్వయంగా వెల్లడి

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వరా భక్తి చానల్ కు నిన్న రాజీనామా చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు, నేడు తానో కొత్త చిత్రాన్ని తీయనున్నట్టు ప్రకటించారు. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ, "నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో..." అని పేర్కొన్నారు. ముగ్గురు డైరెక్టర్స్ తో ముగ్గురు హీరోయిన్స్ తో ఈ సినిమా ఉంటుందని చెబుతూ ఓ పోస్టర్ ను కూడా రాఘవేంద్రరావు విడుదల చేశారు.

More Telugu News