Sujith: ‘సాహో’ నుంచి తప్పుకున్న మ్యూజిక్ డైరెక్టర్లు!

  • సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో’
  • తెలుగు, తమిళం, హిందీలో రూపొందుతోంది
  • ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘సాహో’

ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. యూవీ క్రియేషన్స్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం రూపొందుతుండటంతో ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సమయంలో ఈ సినిమాకు పెద్ద దెబ్బ తగిలింది. మ్యూజిక్ డైరెక్టర్లు శంకర్-ఎహసాన్-లాయ్ ‘సాహో’ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News