YS Jaganmohan Reddy: జగన్‌కు ఇక మీదట తిరుగుండదు: స్వామి కపిలేశ్వరానందగిరి

  • ఢిల్లీ నుంచి తాడేపల్లి చేరుకున్న జగన్
  • జగన్‌ను కలిసిన కపిలేశ్వరానందగిరి
  • ఏపీ పరిస్థితి ఇక మీదట బాగుంటుందని వెల్లడి

వైసీపీ అధినేత, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్న జగన్‌ను పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. త్రిపురకు చెందిన స్వామి కపిలేశ్వరానందగిరి కూడా నేడు జగన్‌ను కలిశారు. ఇకముందు ఆయనకు తిరుగుండదని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇక మీదట బాగుంటుందని స్వామి కపిలేశ్వరానందగిరి తెలిపారు.  

More Telugu News