Guntur District: చంద్రబాబును కలిసిన తెలంగాణ టీడీపీ నేతలు

  • ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి తెలంగాణ టీడీపీ నేతలు
  • బాబును కలిసిన వారిలో ఎల్.రమణ, రేవూరి, రావుల  
  • రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనన్న బాబు

టీడీపీ అధినేత చంద్రబాబును తెలంగాణ టీడీపీ నేతలు కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి ఈరోజు వారు వెళ్లారు. చంద్రబాబును కలిసిన వారిలో ఎల్.రమణ, రేవూరి ప్రకాశ్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఏపీలో టీడీపీ పరాజయం గురించి నేతలు ప్రస్తావించినట్టు సమాచారం. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని వారితో చంద్రబాబు అన్నట్టు సమాచారం.

More Telugu News