Brazil: బ్రెజిల్ జైల్లో టూత్ బ్రష్ లతో దాడిచేసుకున్న ఖైదీలు... 15 మంది మృతి

  • అమెజొనాస్ రాష్ట్రంలో ఘటన
  • తీవ్రరూపం దాల్చిన చిన్నపాటి ఘర్షణ
  • అధికారుల రంగప్రవేశంతో సద్దుమణిగిన ఖైదీలు

మాఫియా సంస్కృతి వేళ్లూనుకుపోయిన దక్షిణ అమెరికా దేశాల్లో చాలా వరకు అరాచక పరిస్థితులు నెలకొని ఉంటాయి. ఇక జైళ్లలో అయితే చెప్పనక్కర్లేదు. ముఠా పోరాటాలు నిత్యకృత్యంగా కనిపిస్తాయి. తాజాగా బ్రెజిల్ దేశంలోని ఓ జైల్లో ఖైదీలు రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పరం దాడులుచేసుకున్నారు. బ్రెజిల్ లోని అమెజొనాస్ రాష్ట్రంలోని ఓ జైల్లో ఖైదీలు రెండు గ్రూపులుగా విడిపోయి చేతికి అందినవాటితో విరుచుకుపడ్డారు.

ఖైదీలు టూత్ బ్రష్షులతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడిన ఈ ఘటనలో 15 మంది ఖైదీలు మృతిచెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. చిన్నపాటి ఘర్షణ కొద్దిసమయంలోనే తీవ్రరూపు దాల్చిందని, దాంతో బిల్డింగ్ పైకి ఎక్కిన ఖైదీలు టూత్ బ్రష్ లతో పొడుచుకోవడమే కాకుండా, మరికొందరిని గొంతునులిమారు. కాసేపటికి అధికారులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చారు.

More Telugu News