polavaram: పోలవరం ప్రాజెక్టుకు డాక్టర్‌ వైఎస్సార్‌ పేరు పెట్టాలి: మచిలీపట్నం ఎంపీ బాలశౌరి

  • ప్రాజెక్టుకు భూమిపూజ చేసింది రాజశేఖర్‌రెడ్డే
  • ఆయన హయాంలోనే కాలువల నిర్మాణం పూర్తయింది
  • ఆయన పేరు పెడితేనే న్యాయంగా ఉంటుంది

రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక భారీ ప్రాజెక్టు పోలవరానికి దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టాలని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి డిమాండ్‌ చేశారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టుకు భూమిపూజ జరిగిందని, కేంద్రంతో పోరాడి నిధులు తెచ్చింది ఆయనేనని గుర్తుచేశారు. వైఎస్సార్‌ అధికారంలో ఉన్నప్పుడే పోలవరం కాలువ నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ఏ విధంగా చూసినా ప్రాజెక్టు నిర్మాణంలో వైఎస్సార్‌ భాగస్వామ్యం అధికం కావున 'డాక్టర్‌ వైఎస్సార్‌ పోలవరం ప్రాజెక్టు' అని నామకరణం చేయడం బాగుంటుందని విజ్ఞప్తి చేశారు.

More Telugu News