ram: 'ఇస్మార్ట్ శంకర్' విడుదల తేదీ ఖరారు

  1. రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' 
  2. నాయికలుగా నిధి - నభా 
  3. జూలై 12వ తేదీన విడుదల

రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' రూపొందుతోంది. నిధి అగర్వాల్ .. నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. జూలై 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

పూరి తన సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. కొంతకాలంగా సక్సెస్ కి దూరంగా వున్న రామ్ కి .. పూరి జగన్నాథ్ కి ఈ సినిమా హిట్ కొట్టవలసిన అవసరం ఎంతయినా వుంది. ఇక నిధి అగర్వాల్ ను నిలబెట్టే బాధ్యత కూడా ఈ సినిమాపైనే వుంది. 

More Telugu News