Ram madhav: జగన్ మోహన్ రెడ్డిని కలసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌

  • జగన్‌కు శాలువా కప్పి సత్కరించిన రాంమాధవ్
  • ఎన్నికల్లో గెలిచినందుకు అభినందనలు
  • తాజా రాజకీయ పరిణామాలపై చర్చ

ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన వైసీపీ చీఫ్ జగన్‌మోహన్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ అభినందనలు తెలిపారు. విజయం సాధించినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాంమాధవ్‌కు జగన్ శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి తాజా రాజకీయ పరిణామాలపై కాసేపు చర్చించుకున్నారు.

అంతకుముందు ప్రధాని మోదీని కలిసిన జగన్ ఈ నెల 30న విజయవాడలో జరగనున్న తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆ తర్వాత బీజేపీ చీఫ్ అమిత్ షాను కలిశారు. కాగా, ప్రధాని మోదీ, జగన్ మోహన్‌రెడ్డి ఇద్దరూ ఒకే రోజున ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే!  

More Telugu News