Narendra Modi: మాతృమూర్తి ఆశీస్సుల కోసం అహ్మదాబాద్ లో వాలిపోయిన మోదీ

  • విమానాశ్రయంలో మోదీకి అమిత్ షా స్వాగతం
  • పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించిన మోదీ
  • పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం

ప్రతి ముఖ్యమైన కార్యక్రమానికి ముందు తల్లి ఆశీస్సులు అందుకోవడం నరేంద్ర మోదీకి ఆనవాయితీ. ఇప్పుడు మరోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న తరుణంలో మాతృమూర్తి దీవెనలు అందుకోవడానికి ఆయన స్వస్థలానికి విచ్చేశారు. ఈ సాయంత్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరం చేరుకున్న మోదీకి ఎయిర్ పోర్టులో బీజేపీ చీఫ్ అమిత్ షా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ స్వాగతం పలికారు. ఆపై, అక్కడికి దగ్గర్లోనే ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని సందర్శించిన మోదీ నివాళులు అర్పించారు. ఈ రాత్రికి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం తన తల్లి నివాసానికి వెళ్లనున్నారు. ఈ నెల 30న మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News