Jagan: మోదీతో భేటీ సందర్భంగా జగన్ ప్రస్తావించిన ప్రధాన అంశాలు ఇవే!

  • ప్రత్యేక హోదా తక్షణ అవసరం అని పేర్కొన్న జగన్
  • పెండింగ్ నిధులపై మోదీతో చర్చ
  • సహకరించాలంటూ విజ్ఞప్తి

మరి కొన్నిరోజుల్లో ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో నరేంద్ర మోదీని కలిశారు. ఈ నెల 30న జరిగే తన ప్రమాణస్వీకారోత్సవానికి విజయవాడ రావాల్సిందిగా మోదీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య చర్చ జరిగింది. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో జగన్ రాష్ట్రపరిస్థితిని మోదీకి వివరించారు.

జగన్ ప్రస్తావించిన ప్రధాన అంశాలు ఇవే...

  • రాష్ట్రానికి ప్రత్యేక హోదా
  • విభజన చట్టంలోని హామీలు అమలు
  • ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధుల విడుదల
  • పోలవరం ప్రాజెక్ట్ కు సహకారం, అదనపు నిధుల మంజూరు
  • రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణ సహకారం
  • కడప స్టీల్ ప్లాంట్
  • దుగరాజపట్నం మేజర్ పోర్టు ఏర్పాటు
  • ఏపీ ఆర్థిక పరిస్థితి
  • రాష్ట్రంలోని ప్రధాన సమస్యలు
కాగా, జగన్ మాట్లాడుతున్నంత సేపు ఓపికగా విన్న మోదీ సానుకూలంగా స్పందించారు. "మీ పదవీకాలంలో మేం చేయగలిగినంత మేర సహాయం చేస్తాం. ఏపీని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడంలో తోడ్పాటునందిస్తాం" అంటూ హామీ ఇచ్చారు.

More Telugu News