Andhra Pradesh: వైసీపీ విజయానికి జనసేన, బీజేపీలే కారణం: ఎమ్మెల్సీ మాధవ్

  • బాబు అసత్య ప్రచారాన్ని మా కార్యకర్తలు నమ్మారు
  • బీజేపీ-వైసీపీ ఒకటేనని చాలా మంది భావించారు
  • ఏ రాష్ట్రానికీ ‘ప్రత్యేక హోదా’ ఇవ్వరు

ఏపీలో వైసీపీ విజయానికి జనసేన, బీజేపీలే కారణమని ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యనించారు. చంద్రబాబు అసత్య ప్రచారాన్ని తమ కార్యకర్తలు చాలా మంది నమ్మారని, బీజేపీ-వైసీపీ ఒకటేనని భావించి చాలా మంది వైసీపీకి ఓటేశారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఏపీలో పర్యటించి రాష్ట్రానికి బీజేపీ చేసిన మేలు ఏంటో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ‘ప్రత్యేక హోదా’ అంశం గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఏ రాష్ట్రానికీ ఈ ‘హోదా’ ఇవ్వరని, ఆర్థిక సహకారం మాత్రం చేస్తారని చెప్పారు. 

More Telugu News