Narendra Modi: అమ్మ ఆశీస్సుల కోసం గుజరాత్ కు.. గంగమ్మ దీవెనల కోసం కాశీకి!

  • వారణాసి నుంచి భారీ మెజారిటీతో నెగ్గిన మోదీ 
  • కాశీ వాసులకు ధన్యవాదాలు  
  • ఆదివారం ఉదయం వారణాసికి ప్రధాని

ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే అని అంటారు. ఆ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రుజువు చేస్తున్నారు. అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశానికి రెండోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో ఆయన తన తల్లి హీరాబెన్ ఆశీర్వాదాల కోసం గుజరాత్ వెళుతున్నారు. అంతేకాకుండా తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పేందుకు వారణాసి కూడా వెళ్లనున్నారు.

ఈ మేరకు మోదీ నిన్న ఓ ట్వీట్ చేస్తూ, ‘‘మా అమ్మ ఆశీర్వాదాల కోసం రేపు (ఈ నెల 25) సాయంత్రం గుజరాత్ వెళుతున్నాను. ఎల్లుండి (ఈ నెల 26) ఉదయం నేను పుణ్య భూమి కాశీలో ఉంటాను. నన్ను విశ్వసించిన కాశీ ప్రజలకు ధన్యవాదాలు చెప్పేందుకు వెళుతున్నాను’’ అని మోదీ పేర్కొన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో మోదీ తన సమీప ప్రత్యర్థి, సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి షాలినీ యాదవ్ పై సుమారు 4.7 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 353 స్థానాలు దక్కించుకుని, రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

More Telugu News