YSRCP: జగన్ తన తండ్రిలా ప్రజలను ప్రేమించారు: వైసీపీ ఎమ్మెల్యే రోజా

  • ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు
  • జగన్ తిరుగులేని మెజార్టీ సాధించారు
  • వైసీపీ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు

జగన్ తన తండ్రిలా ప్రజలను ప్రేమించారని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్సార్ ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు.

ఈ సమావేశానికి హాజరైన రోజాను మీడియా పలకరించగా ఆమె మాట్లాడుతూ, సింహం సింగిల్ గానే వస్తుందన్నట్టు, జగన్ ఈరోజున తిరుగులేని మెజార్టీ సాధించి సీఎం కాబోతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. జగన్ ని ప్రజలు ఎంతగా అభిమానిస్తున్నారన్న దానికి ఈ మెజార్టీయే నిదర్శనమని చెప్పారు. ఏపీలో వైసీపీ సాధించిన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు వెనుక ఉన్న ఎమ్మెల్యేలను చూస్తే ఆ అనుభవం ఏమిటో తెలుస్తుందని ఎద్దేవా చేశారు.

More Telugu News