bala: ఈ వివాదానికి ఇంతటితో తెరదించాలనుకుంటున్నాను: దర్శకుడు బాల

  • విక్రమ్ తనయుడు హీరోగా 'ఆదిత్య వర్మ'
  • తెలుగు 'అర్జున్ రెడ్డి'కి రీమేక్ 
  • విక్రమ్ కి నోటీసులు పంపిన బాల

తెలుగులో 'అర్జున్ రెడ్డి' సినిమాను తమిళంలో 'వర్మ' అనే టైటిల్ తో రూపొందించారు. బాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్ కుమారుడు 'ధృవ్' హీరోగా చేశాడు. అయితే దర్శకుడితో  ఏర్పడిన విభేదాల కారణంగా ఆ అవుట్ పుట్ ను నిర్మాతలు పక్కన పెట్టేశారు. ఇందులో విక్రమ్ పాత్ర ఉందనే టాక్ కోలీవుడ్లో వినిపించింది. 'ధృవ్' మినహా మిగతా తారాగణాన్ని మార్చేసి, 'గిరీశయ్య' అనే దర్శకుడితో మళ్లీ చిత్రీకరించడం మొదలుపెట్టారు.

ఈ సినిమా టైటిల్ ను 'ఆదిత్య వర్మ'గా మార్చారు. తాజాగా బాల .. విక్రమ్ కి లీగల్ నోటీసులు పంపించారు. తాను షూట్ చేసిన ఏ సన్నివేశాన్ని కూడా 'ఆదిత్య వర్మ' సినిమాలో వాడకూడదనేది ఆ నోటీసుల సారాంశం. జరిగిన సంఘటనపై తను మాట్లాడితే ధృవ్ భవిష్యత్తుపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో మౌనంగా ఉంటున్నాననీ, ఈ వివాదానికి ఇంతటితో తెరదించాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. 

More Telugu News