prabhas: 'సాహో'లో సల్మాన్ అతిథి పాత్రపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

  • యాక్షన్ సీన్స్ కోసమే 90 కోట్ల ఖర్చు
  •  వివిధ భాషల్లో విడుదల చేసే ఆలోచన
  •  సల్మాన్ ను సంప్రదించనే లేదు

ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రం రూపొందింది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించింది. ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీన్స్ కోసమే 90 కోట్ల వరకూ ఖర్చు చేశారట. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకి మరింత క్రేజ్ తీసుకురావడానికి గాను అతిథి పాత్ర కోసం సల్మాన్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ విషయంపై దర్శకుడు సుజీత్ స్పందిస్తూ, "ఈ సినిమా షూటింగును పూర్తి చేసేశాము. అతిథి పాత్ర కోసం సల్మాన్ ను సంప్రదిస్తున్నట్టుగా వస్తోన్న వార్తల్లో నిజం లేదు. అసలు అలాంటి పాత్ర ఏది ఈ సినిమాలో కనిపించదు" అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. దాంతో రెండు మూడు రోజులుగా జరుగుతోన్న ఈ ప్రచారానికి తెరపడినట్టైంది.

More Telugu News