Telugudesam: రాజమండ్రిలో మురళీమోహన్ కోడలు మాగంటి రూప పరాజయం

  • రాజమండ్రిలో మార్గాని భరత్ విజయం
  • సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన టీడీపీ
  • ఓటర్లను ఆకట్టుకోలేకపోయిన మాగంటి రూప

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లోక్ సభ స్థానంలో సినీ నటుడు, టీడీపీ నేత మురళీమోహన్ కోడలు మాగంటి రూప పరాజయం పాలయ్యారు. విజయానికి ఎంతో కృషి చేసినా మాగంటి రూపకు ఓటమి తప్పలేదు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ విజయం సాధించారు. రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ అయిన మురళీమోహన్ కొన్ని కారణాల వల్ల తాను బరిలో దిగకూడదని నిర్ణయించుకున్నారు. అయితే టీడీపీ హైకమాండ్ ఆయన కోడలు మాగంటి రూపకు లోక్ సభ టికెట్ ఇచ్చింది. 

More Telugu News