Loksabha: కాసేపట్లో మోదీ అధ్యక్షతన సమావేశం కానున్న పార్లమెంటరీ బోర్డు

  • ఘన విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ
  • పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం
  • పలు కీలక అంశాలపై చర్చ

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుని రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నేటి సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నేతలు చర్చించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. సమావేశ విషయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలకు కూడా తెలియజేయనున్నారు.  

More Telugu News