Nizamabad District: నిజామాబాద్ లో టీఆర్ఎస్ కు షాక్.. కవితను ఓడించిన బీజేపీ!

  • టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత అపజయం
  • బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపు
  • 68 వేల ఓట్ల మెజార్టీ సాధించిన అరవింద్

నిజామాబాద్ లో టీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓటమిపాలయ్యారు. కవితపై బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపొందారు. 68 వేల ఓట్ల మెజార్టీతో అరవింద్ విజయం సాధించారు. కాగా, ఈ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని ఎన్నికల ప్రచార సమయంలో కవిత ధీమాగా చెప్పారు. ఇందుకు భిన్నంగా ప్రజల తీర్పు వెలువడటంతో ఆమె ఓటమిని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. 

More Telugu News