Anitha: టీడీపీ అభ్యర్థి అనితపై వనిత ఘన విజయం

  • కొవ్వూరు స్థానాన్ని కైవసం చేసుకున్న వైసీపీ
  • ఎక్కువ స్థానాలను సాధించి జిల్లాపై పట్టు
  • వైసీపీ ఖాతాలోకి ఏలూరు, దెందులూరు, చింతలపూడి

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి అనితపై వైసీపీ అభ్యర్థి తానేటి వనిత ఘన విజయం సాధించారు. టీడీపీకి బాగా పట్టున్న జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఒకటి. ఈ సారి అక్కడ వైసీపీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుని జిల్లాపై పట్టు సాధించింది. జిల్లాలో కొవ్వూరుతో పాటు గతంలో టీడీపీ స్థానాలైన చింతలపూడి, దెందులూరు, ఏలూరు స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది.

More Telugu News