Andhra Pradesh: భీమవరంలో పవన్ కల్యాణ్ ఓటమి.. వైసీపీ ఘన విజయం!

  • పవన్ కల్యాణ్ కు నిరాశ
  • వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓటమి
  • గాజువాక నియోజకవర్గంలో వెనుకంజలో పవన్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు నిరాశ ఎదురైంది. భీమవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ ఓటమి పాలయ్యారు. పవన్ కల్యాణ్ పై 3,900 మెజార్టీతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్టణంలోని గాజువాక నియోజకవర్గాల నుంచి ఆయన బరిలోకి దిగారు. భీమవరంలో ఓటమి పాలైన పవన్ కల్యాణ్, గాజువాక నియోజకవర్గంలో కూడా వెనుకంజలో ఉన్నారు. 7,700 ఓట్ల తేడాతో పవన్ వెనుకబడి ఉన్నట్టు సమాచారం.

More Telugu News