Guntur District: ఉండవల్లిలో చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్తత!

  • సీఎం నివాసం దగ్గర వైసీపీ కార్యకర్తల నినాదాలు
  • వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న సెక్యూరిటీ 
  • టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో వైసీపీ అత్యధిక స్థానాల్లో లీడింగ్ లో ఉండటంతో ఉత్సాహంగా ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో, వైసీపీ కార్యకర్తలను అక్కడి సెక్యూరిటీ అడ్డుకుంది. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగినట్టు స్థానికుల సమాచారం.

More Telugu News