Congress: ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీని ఓదార్చిన ప్రియాంక

  • ఢిల్లీలో రాహుల్ నివాసానికి వెళ్లిన ప్రియాంక
  • ట్రెండ్స్ పై చర్చ
  • మోదీ ప్రభంజనంలో కొట్టుకుపోయిన కాంగ్రెస్

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఊహించిన రీతిలో ప్రజాతీర్పు వెలువడడం పట్ల పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్ర నిరాశానిస్పృహల్లో మునిగిపోయినట్టు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో, పార్టీ ప్రచారకర్త ప్రియాంక గాంధీ కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని తన సోదరుడు రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లారు. రాహుల్ ను కలిసి ఫలితాలపై ఓదార్చినట్టు సమాచారం. ఇద్దరి మధ్య దేశవ్యాప్తంగా కౌంటింగ్ ట్రెండ్స్ పై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

యూపీ వంటి భారీ సంఖ్యలో లోక్ సభ స్థానాలు ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో గణనీయమైన స్థాయిలో సీట్లు గెలిచేందుకు కాంగ్రెస్ ప్రియాంకను స్టార్ క్యాంపెయినర్ గా రంగంలోకి దించింది. తన స్థాయికి తగినట్టుగానే ప్రియాంక భారీ జనసమూహాలను రోడ్ షోలకు, సభలకు రప్పించగలిగింది. కానీ, ఓట్లు సాధించిపెట్టే విషయంలో ఆమె కూడా విఫలమైంది. ఇదంతా మోదీ ప్రభంజనం కారణంగానే అని వేరే చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో ప్రియాంక సోదరుడు రాహుల్ నివాసానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

More Telugu News