cuddapah: ఏపీ లోక్ సభ తొలి ఫలితం వెల్లడి.. వైసిపీ అభ్యర్థి మిథున్ రెడ్డి విజయం

  • వైసీపీ అధినేత జగన్ సన్నిహితుడు మిథున్ రెడ్డి
  • రాజంపేట నుంచి ఎంపీగా గెలుపు
  • మిథున్ రెడ్డిని అభినందించిన పార్టీ శ్రేణులు

కడప జిల్లా రాజంపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైసీపీ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై లక్షకు పైగా మెజార్టీతో ఆయన గెలుపొందారు. వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితుడుగా పేరు పొందిన మిథున్ రెడ్డి విజయంపై పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. గత లోక్ సభ ఎన్నికల్లో కూడా మిథున్ రెడ్డి భారీ విజయం సాధించారు.

More Telugu News