Visakhapatnam District: అరకులో పనిచేయని సెంటిమెంట్!

  • అరకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిడారి శ్రవణ్ కుమార్
  • శ్రవణ్ కంటే ‘నోటా’కే అత్యధిక ఓట్లు
  • మంత్రి పదవికి ఇటీవలే రాజీనామా చేసిన శ్రవణ్

విశాఖపట్టణం జిల్లాలోని అరకులో సెంటిమెంట్ పని చేయలేదు. ఏపీ మంత్రి, అరకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిడారి శ్రవణ్ కుమార్ కంటే నోటాకే అత్యధిక ఓట్లు లభించాయి. కాగా, అరకు ఎమ్మెల్యే, శ్రవణ్ తండ్రి కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు ఇటీవల హతమార్చిన విషయం తెలిసిందే. కిడారి కుటుంబం ఎదుగుదల బాధ్యతను తీసుకున్న చంద్రబాబు, అందులో భాగంగా శ్రవణ్ కు మంత్రి పదవి ఇచ్చారు. ఇదే నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో శ్రవణ్ ను బరిలోకి దింపారు.

More Telugu News