AIADMK: తమిళనాడులో కొట్టుకుపోయిన అన్నాడీఎంకే!

  • మూడు స్థానాల్లో మాత్రమే ఆధిక్యం చూపుతున్న అన్నాడీఎంకే
  • 35కు పైగా స్థానాల్లో డీఎంకే ప్రభంజనం
  • నైరాశ్యంలో అన్నాడీఎంకే శ్రేణులు

జయలలిత మరణం తర్వాత వివాదాల సుడిగుండంలో చిక్కుకుని ముక్కలు చెక్కలై, తిరిగి ఒక్కటైన అన్నాడీఎంకే లోక్‌సభ ఎన్నికల్లో చతికిల పడింది. ఈ ఎన్నికలో ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. మరోవైపు, ప్రతిపక్ష డీఎంకే మాత్రం వీరవిహారం చేస్తోంది. ఇప్పటి వరకు వెల్లడైన ట్రెండ్స్ ప్రకారం.. డీఎంకే 35 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, అన్నాడీఎంకే కేవలం మూడు స్థానాల్లో మాత్రం పడుతూ లేస్తూ వస్తోంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే డీఎంకే తమిళనాడులో క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. పోటీ చేసిన అన్ని చోట్లా గట్టి పోటీ ఇస్తోంది. తాజా ఫలితాలతో అన్నాడీఎంకే శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. పార్టీ కార్యాలయాలు బోసి పోయాయి. 

More Telugu News