Andhra Pradesh: వైసీపీలో ఎన్నికల జోష్.. సంబరాలు చేసుకుంటున్న జగన్, విజయసాయిరెడ్డి!

  • ఏకంగా 150 స్థానాల్లో లీడింగ్ పై హర్షం
  • ఆలింగనం చేసుకున్న జగన్, విజయసాయిరెడ్డి
  • 23 స్థానాలకే పరిమితమయిన తెలుగుదేశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 150 స్థానాల్లో వైసీపీ విజయం దిశగా పరుగులు తీస్తున్న వేళ ఆ పార్టీ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. ఈరోజు వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత జగన్, సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఫలితాలను వీక్షించారు.

భారీ మెజారిటీ దిశగా వైసీపీ దూసుకుపోతుండటంతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి జగన్ ను ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజా ఫలితాల ప్రకారం వైసీపీ 150 స్థానాల్లో, టీడీపీ 23 స్థానాల్లో, జనసేన 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

More Telugu News