Vijayawada: విజయవాడ సెంట్రల్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీడీపీ అభ్యంతరం

  • 60 ఏ ప్రకారం రావాల్సిన ఓట్లు 80సీ ప్రకారం
  • ఆర్వోతో టీడీపీ నేతల వాగ్వివాదం
  • ఈసీతో మాట్లాడిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్న ఆర్వో

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్వోతో ఆ పార్టీ నేతలు వాగ్వివాదానికి దిగారు. 60 ఏ ప్రకారం రావాల్సిన పోస్టల్ బ్యాలెట్లను 80సీ ప్రకారం పంపారని టీడీపీ నేతలు ఆరోపించారు. విషయాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేతల అభ్యంతరంపై స్పందించిన ఆర్వో ఎన్నికల సంఘంతో మాట్లాడిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

More Telugu News