Chandrababu: మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం.. చంద్రబాబు, జగన్ నివాసాల వద్ద భద్రత పెంపు

  • ఫలితాల విడుదల నేపథ్యంలో ఎన్నికల అధికారి నిర్ణయం
  • కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పోలీసులు
  • పోలీసుల పరిశీలకుడితో ద్వివేది చర్చ

దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓట్ల లెక్కింపు మరో రెండు గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నివాసాల వద్ద పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసు పరిశీలకుడు కేకే శర్మతో ఈ విషయమై చర్చించినట్టు ఆయన తెలిపారు. ఫలితాల అనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ద్వివేది వివరించారు. 

More Telugu News