Car: ఎండలు మండిపోతుండడంతో కారును ఆవు పేడతో అలికిన యజమాని!

  • అహ్మదాబాద్ లో ఓ మహిళ వినూత్న చర్య
  • పేడను సరికొత్తగా ఉపయోగించిన వైనం
  • సోషల్ మీడియాలో వైరల్

సాధారణంగా ఇళ్లముందు పేడతో కళ్లాపి చల్లి ముగ్గులు పెట్టడం మన సంప్రదాయం. అయితే, అహ్మదాబాద్ కు చెందిన ఓ మహిళ పేడను వినూత్నరీతిలో ఉపయోగించి అందరి దృష్టిని ఆకర్షించింది. దేశవ్యాప్తంగా అనేకచోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అహ్మదాబాద్ లో కూడా ఎండలు మండిపోతుండడంతో సదరు మహిళ తన టయోటా కరొల్లా ఆల్టిస్ కారును మొత్తం ఆవు పేడతో అలికేసింది. పేడను అంగుళం మందాన పట్టే విధంగా కారుకు కోటింగ్ ఇచ్చింది. అద్దాలు, టైర్లు మినహాయించి కారు పైభాగమంతా పేడమయం చేసింది. ఆ కారును రూపేశ్ గౌరంగ దాస్ అనే వ్యక్తి ఫేస్ బుక్ లో పెట్టడంతో వైరల్ అయింది.

More Telugu News