Dost: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల

  • రేపటి నుంచి ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
  • జూన్ 3 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం
  • జూలై 1 నుంచి ప్రారంభం కానున్న తరగతులు

తెలంగాణలో డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల కోసం ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. జూన్ 3 వరకూ మొదటి విడత రిజస్ట్రేషన్లకు సమయం ఉంది. గతంలో విడుదలైన నోటిఫికేషన్‌ను దోస్త్ కమిటీ వాయిదా వేసింది.

ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబు పత్రాలతో పాటు రీ వెరిఫికేషన్ ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించడంతో నోటిఫికేషన్‌ను వాయిదా వేసింది. తిరిగి నోటిఫికేషన్‌ను నేడు విడుదల చేసింది. మూడు విడతలలో సీట్ల కేటాయింపు అనంతరం జూలై 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. 

More Telugu News