modi: మోదీ పర్మినెంట్ గా హిమాలయాలకు వెళ్లాలి: టీడీపీ అధికార ప్రతినిధి యామిని

  • అక్కడే ఓ గుహను శాశ్వతంగా అద్దెకు తీసుకోవాలి
  • ఓ ఫొటోగ్రాఫర్ ను కూడా మోదీ తీసుకెళ్లాలి
  • మోదీ వెళితే దేశానికి పట్టిన దరిద్రం వదులుతుంది

ప్రధాని నరేంద్ర మోదీపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సెటైర్లు విసిరారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ నెల 23 తర్వాత మోదీ హిమాలయాలకు వెళతారో, అడవుల్లోకి వెళతారో అని ఇంతకుముందు తాను వ్యాఖ్యలు చేశానని, ఆ తర్వాత రెండురోజులకే ఆయన తీర్థయాత్రలకు వెళ్లారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మళ్లీ చెబుతున్నా, మోదీ ఓ ఫొటోగ్రాఫర్ ను తీసుకుని పర్మినెంట్ గా హిమాలయాలకు వెళ్లాలని, ఓ గుహను శాశ్వతంగా అద్దెకు తీసుకుని అక్కడే ఉండాలని సెటైర్లు విసిరారు. దొంగ తీర్థయాత్రలు మాత్రం చేయొద్దని, భగవంతుడిని స్మరించుకోవాలని సూచించారు. మోదీ ఆ విధంగా చేస్తే దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందంటూ విమర్శించారు.

More Telugu News