Andhra Pradesh: రాజన్న సుపరిపాలన సిద్ధించడమే ఇక నా సంకల్పం: వైఎస్ జగన్

  • ‘ప్రజాపరిపాలనే సాగాలి’ అనే క్యాప్షన్ తో పోస్టర్ విడుదల
  • ఈ పోస్టర్ లో నవ్వుతూ మైకు పట్టుకుని ఉన్న జగన్
  • మండు టెండల్ని సైతం లెక్కజేయకుండా ప్రజలు ఓట్లేశారు

ఏపీలో వైసీపీ గెలుస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. తమ అధినేత జగన్ సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ నేతలు పదేపదే జోస్యం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఓ ఆసక్తికర పోస్టర్ ను పోస్ట్ చేశారు. రాజన్న సుపరిపాలనను తీసుకురావాలన్నదే తన సంకల్పమని పేర్కొన్నారు.

ఈ పోస్టర్ లో నవ్వుతూ మైకు పట్టుకుని జగన్ ఉండటం గమనించవచ్చు. ప్రజాస్వామ్యంలో ‘ప్రజాపరిపాలనే సాగాలి’ అనే క్యాప్షన్ తో ఉన్న ఈ పోస్టర్ పై మండు టెండల్ని సైతం లెక్కజేయకుండా క్యూలలో నిలబడి ప్రజలు ఓట్లేశారని, ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనాన్ని నిలబెట్టారని, వారి ఆశీస్సులు అందిన వేళ వారికి బాధ్యుడినై ఉంటానని రాశారు. 

More Telugu News