ramya behara: 'బాహుబలి' కోసం పాడిన పాటతో పాప్యులర్ అయ్యాను: సింగర్ రమ్య బెహరా

  • 'వెంగమాంబ'లో తొలిపాట పాడాను
  •  'ప్రేమకథా చిత్రం'లో హీరోయిన్ కి పాడాను
  •  'బాహుబలి' లోని పాటతో మంచి గుర్తింపు  

ఎప్పుడు చూసినా చిరునవ్వును చిందిస్తూ కనిపించే రమ్య  బెహరా, గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది. బాలసుబ్రహ్మణ్యం .. ఎస్పీ శైలజ వంటి ప్రముఖ గాయనీగాయకులచే ప్రశంసలు అందుకుంది. అలాంటి రమ్య బెహరా తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన గురించిన విశేషాలను చెప్పుకొచ్చింది.

"నా కెరియర్లో మొదటి పాటను 2009లో 'వెంగమాంబ' సినిమాలో మీనా చిన్నప్పటి పాత్రకు పాడాను .. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను. ఆ తరువాత 'రాజన్న' సినిమాలో చిన్నపిల్లకి పాడాను. 2013 నుంచి హీరోయిన్స్ కి పాడటం మొదలుపెట్టాను. 'ప్రేమకథా చిత్రం' సినిమాలో 'కొత్తగున్న హాయి నువ్వా' అనే పాట హీరోయిన్ కి నేను పాడిన తొలిపాట. ఆ తరువాత కొన్ని పాటలు పాడినప్పటికీ, 'బాహుబలి' సినిమాలో పాడిన 'ధీవర .. ' అనే పాట మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ పాటతోనే నా పేరు చాలామందికి తెలిసింది" అని చెప్పుకొచ్చింది. 

More Telugu News