MS Dhoni: రిటైర్మెంట్ తర్వాత ధోనీ చేయబోయే పని ఇదే!

  • వరల్డ్ కప్ తర్వాత ధోనీ రిటైరయ్యే అవకాశం
  • పెయింటింగ్స్ వేస్తానన్న ఝార్ఖండ్ డైనమైట్
  • తన చిత్రాలతో త్వరలోనే ప్రదర్శన ఏర్పాటు

భారత క్రికెట్ రంగంపై మహేంద్ర సింగ్ ధోనీ ప్రభావం అపారం. టీమిండియాకు అంతర్జాతీయ స్థాయిలో ఓ బలమైన జట్టుగా గుర్తింపు తీసుకువచ్చింది ధోనీ అనడంలో సందేహంలేదు. అయితే, కొన్నాళ్లుగా ధోనీ రిటైర్మెంట్ పై వార్తలు వినిపిస్తున్నాయి. బహుశా ఈ వరల్డ్ కప్పే ఝార్ఖండ్ డైనమైట్ కి చివరిది అంటూ కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ధోనీ తాను రిటైరైన తర్వాత ఏంచేయబోయేది అభిమానులతో పంచుకున్నాడు.

బాల్యంలో తాను ఓ పెద్ద చిత్రకారుడు అవ్వాలనుకున్నానని, అది తన కల అని తెలిపాడు. అయితే క్రికెట్ రంగంలో అడుగుపెట్టి చాలాదూరం వెళ్లిపోయాయని, ఇక ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత తన మనసుకు నచ్చిన పనిచేస్తానని వెల్లడించాడు. ఇప్పటికే కొన్ని చిత్రాలను గీసినట్టు ఓ వీడియోలో తెలిపాడు. అంతేకాదు వాటిని అందరికీ చూపించాడు. త్వరలోనే తన పెయింటింగ్స్ తో ఓ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించాడు.

More Telugu News