Chandrababu: ఎన్డీయేతర కూటమి ఏర్పాటుపై మమతతో ముగిసిన చంద్రబాబు భేటీ

  • నేటి మధ్యాహ్నం కోల్‌కతా వెళ్లిన చంద్రబాబు
  • ఎన్నికల అనంతరం చేపట్టాల్సిన చర్యలపై చర్చ
  • రేపు ఈసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల భేటీ ముగిసింది. ఎన్డీయేతర కూటమి ఏర్పాటుపై చంద్రబాబు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం కోల్‌కతాకు వెళ్లిన చంద్రబాబు, మమతతో భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో ముఖ్యంగా ఎన్నికల ఫలితాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఫలితాల అనంతరం చేపట్టాల్సిన చర్యలపై చంద్రబాబు ముఖ్యంగా చర్చించినట్టు సమాచారం. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈసీ ప్రధాన కార్యాలయం వద్ద 23 ఎన్డీయేతర పక్షాల నేతలు ధర్నా చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మరికాసేపట్లో కోల్‌కతా నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.

More Telugu News