Rajasthan: సామూహిక అత్యాచార బాధితురాలికి పోలీస్ ఉద్యోగం.. రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయం!

  • భర్త ఎదుటే వివాహితపై సామూహిక అత్యాచారం
  • ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఎన్నికల సమయంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు

గత నెలలో రాజస్థాన్‌లోని థనగాజి-ఆళ్వార్ బైపాస్ రోడ్డు వద్ద బైక్‌పై వెళుతున్న ఓ జంటను అటకాయించి వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి భర్త ఎదుటే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  బాధితురాలికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వాలని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది.

More Telugu News